మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జల్ పల్లి 65 వ డివిజన్ జల్ పల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా సేవకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని కేఎల్ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన నిత్యం ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాసేవను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ షేక్ జహంగీర్ , శ్రీరామ కాలనీ మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ , మసన రవి, ఐ ఎన్ టి యు సి ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నవాజ్, బాలాజీ, యంజాల శ్రీనివాస్, మల్లు, మేరాజ్, పటేల్, షేక్ జుబేర్, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.