మాతృదేవోభవ అనాధాశ్రమంలో అన్నదానం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. నాదర్ గూల్ మాతృదేవోభవ అనాధాశ్రమంలో అన్నదానం కార్యక్రమాన్ని మర్రి శశాంక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు పూజ క్రతువు నిర్వహించారు. ప్రజా సేవలో నిండునూరేళ్లు ఉండేలా దేవుడి ఆశీస్సులు కిచ్చెన్నగారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహా స్థానిక కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.
