ePaper
Monday, April 27, 2026
ePaper
Homeతెలంగాణరంగారెడ్డికవిత పార్టీతో ప్రజల్లో నమ్మకం కలిగింది - టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి

కవిత పార్టీతో ప్రజల్లో నమ్మకం కలిగింది – టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి

📰 Generate e-Paper Clip

కవిత ప్రకటించిన నూతన పార్టీతో సామాన్యుడి కష్టాలను తీర్చి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారన్న నమ్మకం ప్రజల్లో కలిగింది

మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య

ఉద్యమకారుల ఆత్మగౌరవ జెండాను ఎగరేయడమే టీఆర్ఎస్ లక్ష్యమని తెలంగాణ రాజకీయ యవనికపై నూతన శకాన్ని ఆరంభిస్తూ, మేడ్చల్ వేదికగా జరిగిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ఆవిర్భావ సభ అద్భుత విజయం సాధించడం పట్ల పార్టీ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది అన్నారు. ఈ పేరుతో తెలంగాణ ప్రజలకు, మన ప్రాంతీయ రాజకీయ పార్టీతో ఉన్న ‘పేగు బంధం’ మళ్ళీ బలపడిందన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి, ఈ పేరును ఖరారు చేసిన కవితక నిర్ణయం అత్యంత అభినందనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం సభ వేదికగా కవిత ప్రకటించిన విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం వ్యవసాయం, అభివృద్ధి పథకాలు రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చాయని తెలిపారు. సామాన్యుడి కష్టాలను తీర్చి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఉద్యమకారుల ఆత్మగౌరవానికి అండగా “తెలంగాణ ఉద్యమకారుల ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్న శక్తుల కుట్రలను చేధించి, వారికి సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ ఉద్యమకారుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపిందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!