టీఆర్ఎస్ పేరు ప్రకటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మన తొలివెలుగు: తెలంగాణలో మరో కొత్త వెలమ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మునిరాబాద్ లోని అద్వైయా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సభలో కొత్త పార్టీ పేరును జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును కాపీ కొట్టి అచ్చం అదే అర్థం వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన అని నామకరణం చేశారు. తెలంగాణ ప్రజలను ఈ వెలమ దొరలు మరోసారి మోసం చేయాలని కుట్ర చేస్తున్నారు. బీసీలంతా రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న తరుణంలో ఈమె అలవి గాని హామీలను ఇస్తూ తానే రాబోయే కాలంలో ముఖ్యమంత్రిని అని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రజలు అంటే వీళ్ళకి పిచ్చివాళ్లుగా కనిపిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడితే.. మరోసారి అవినీతి సొమ్ముతో విర్రవిగే ఇలాంటి వాళ్లకు దిమ్మ తిరిగే సమాధానం తెలంగాణ ప్రజలు ఇస్తారని తెలుసుకోవాలి..?
కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అని ప్రకటించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుతో కూడిన జెండాను కూడా ఆమె ఆవిష్కరించారు. జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్ దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలతో పార్టీ జెండాను రూపొందించారు.
ముందుగా బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజారాహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు చేరుకొని నివాళులర్పించారు అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో సరికొత్త విప్లవం రాబోతుందని తాను కచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. నిరుపేద బడుగు వర్గాల గొంతుకనై పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు.
